K Rajan: తప్పు చేస్తే వెంటనే ఖండించాలి..
ABN, First Publish Date - 2022-07-30T18:00:34+05:30
మన కళ్ళ ఎదుట ఎవరు తప్పు చేసినా వెంటనే ఖండిచాలని, అలా చేయనివారు నపుంసకులని సినీయర్ నిర్మాత, నటుడు కె.రాజన్ (K Rajan) అన్నారు. హీరో అధర్వ (Adharva) నటించిన కొత్త చిత్రం ‘కురుది ఆట్టం’.
మన కళ్ళ ఎదుట ఎవరు తప్పు చేసినా వెంటనే ఖండిచాలని, అలా చేయనివారు నపుంసకులని సినీయర్ నిర్మాత, నటుడు కె.రాజన్ (K Rajan) అన్నారు. హీరో అధర్వ (Adharva) నటించిన కొత్త చిత్రం ‘కురుది ఆట్టం’. ఈ మూవీ ట్రైలర్ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. శ్రీగణేష్ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘8 తోట్టాగల్’ అనే సినిమా నిర్మించి మంచి గుర్తింపు పొందారు. రాక్ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై నిర్మాత టి.మురుగానందం నిర్మించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ట్రైలర్ ఆడియో రిలీజ్లో దర్శకుడు మిష్కిన్, నిర్మాత కె.రాజన్, హీరో అధర్వ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో అధర్వ మాట్లాడుతూ.. ‘ఈ ట్రైలర్లో నేను కష్టపడినట్టు కనిపించినా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి శ్రమించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ. ‘మన కళ్ళముందు జరిగే తప్పును ఖచ్చితంగా ఖండిచాలి. అలా చేస్తే అదే తప్పు మరో మారు చేసేందుకు భయపడతారు. తప్పును ఖండించలేనివారు నపుంసకులతో సమానం’ అని అన్నారు.
దర్శకుడు శ్రీగణేశ్ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడానని భావిస్తున్నాను. కొన్ని కారణాల రీత్యా షూటింగ్ ఆలస్యమైంది. ఈనెల 5న విడుదల సినిమాను చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆదరించాలి’.. అని కోరారు. కాగా, ఈ చిత్రంలో అధర్వ సరసన ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) నటించగా.. రాధారవి, రాధిక, వాట్సన్ చక్రవర్తి, వినోద్ శంకర్ తదితరులు నటించారు. కబడ్డీని మదురై బ్యాక్గ్రౌండ్గా తెరకెక్కించారు.