Mohanlal ను PV Sindhu కలవడమేంటనుకుంటున్నారా..? అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2022-05-08T02:21:14+05:30 IST
బ్యాడ్మింటన్ క్రీడలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన క్రీడాకారిణి పివి. సింధు (PV Sindhu). ఒలంపిక్స్లోను రజత పతాకాన్ని గెలుచుకుని ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది.
బ్యాడ్మింటన్ క్రీడలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన క్రీడాకారిణి పివి. సింధు (PV Sindhu). ఒలంపిక్స్లోను రజత పతకాన్ని గెలుచుకుని ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది. ఆమె తాజాగా ఓ సెలబ్రిటీని కలుసుకుంది. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్లాల్ (Mohanlal)ను పివి. సింధు గోవాలోని జిమ్లో కలుసుకుంది. ఈ సందర్భంగా అతడితో ఫొటో తీసుకుంది. అనంతరం ఆ పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు.. ‘‘క్యాప్షన్ అవసరం లేదు. మోహన్ లాల్ గారిని కలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె పోస్ట్ పెట్టిన కాసేపటికే ఆ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. అభిమానులందరు ఆ పిక్ను షేర్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోహన్ లాల్ అభిమానులందరు ఆ ఫొటో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వీరిలో ఉన్నారు. పివి. సింధు బ్యాడ్మింటన్లో అనేక ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలుపొందిన మొదటి ఇండియన్ పివి. సింధునే. కొన్ని రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో వైరల్గా మారిన ‘అరబిక్ కుతు’ పాటకు స్టెప్పులేసింది. ఆ వీడియోతో నెటిజన్లు మనస్సును కొల్లగొట్టింది. ఇక మోహన్ లాల్ కెరీర్ విషయానికి వస్తే.. ‘బరోజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికీ అతడే దర్శకత్వం వహించడం విశేషం.