Kangana Ranaut చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం
ABN , First Publish Date - 2022-06-27T16:09:50+05:30 IST
ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్డ్రీ అడ్రెస్ మారింది. బాలీవుడ్ ప్రేక్షకుల్నే మెప్పించి.. వరుస సంచలనాలకు తెరతీస్తోన్న నేపథ్యంలో బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు సౌత్ జనంతో ట్రావెల్ అవడానికి మొగ్గుచూపిస్తున్నారు.
ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్డ్రీ అడ్రెస్ మారింది. బాలీవుడ్ ప్రేక్షకుల్నే మెప్పించి.. వరుస సంచలనాలకు తెరతీస్తోన్న నేపథ్యంలో బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు సౌత్ జనంతో ట్రావెల్ అవడానికి మొగ్గుచూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో వరుసగా బాలీవుడ్ లో చిత్రాలు రాబోతుండగా.. కోలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ మొదలవుతోంది. అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రానికి జీవీ ప్రకాష్ (GV Prakash) సంగీతం అందించబోతుండడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని జీవీ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ‘కంగనా రనౌత్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె కలల ప్రాజెక్టులో పని చేసేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో జరిగిన అనేక సంఘటనల సమూహారంతో ‘ఎమర్జెన్సీ’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండడం అంతటా ఆసక్తిగా మారింది. కాగా, కంగనా నటించిన ‘తలైవి’ (Thalaivi) చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత (jayalalitha) జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఎల్.విజయ్ (AL Vijay) తెరకెక్కించారు. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రను పోషించనుండడం విశేషమని చెప్పాలి. పీరియాడికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కతోన్న ‘ఎమర్జెన్సీ’ చిత్రం జీవీకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.