సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారు : ధనుష్ తండ్రి కస్తూరి రాజా

ABN, First Publish Date - 2022-01-20T02:07:55+05:30

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె  ఐశ్వర్య దంపతులుగా విడిపోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు. పెళ్లి అయిన 18ఏళ్ల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా ప్రకటనను విడుదల చేశారు. ధనుష్ తండ్రి కస్తూరిరాజా తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ దంపతులు భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుని త్వరలోనే కలిసి పోయే అవకాశం ఉందని వెల్లడించారు. 


 ‘‘ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం. అటువంటి గొడవలే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు అందించాను. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు’’ అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తెలిపారు.




Updated Date - 2022-01-20T02:07:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!