ఏప్రిల్లో ‘గాలివాన’
ABN , First Publish Date - 2022-02-02T02:53:26+05:30 IST
‘జీ 5’ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించబోతోంది. బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే
‘జీ 5’ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించబోతోంది. బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్తో బిబిసి రీజనల్ ఎంటర్టైన్మెంట్లోకి అడుగు పెడుతోంది అని నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్కు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్, హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రాంతీయ టెలికాం శిక్షణా కేంద్రంలో జరుపుకుంటోంది. మంగళవారం ఆన్లొకేషన్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రాధిక మాట్లాడుతూ.. ‘‘శరత్ మరార్గారిని చిరంజీవిగారితో చాలాసార్లు చూశాను. ఆయన నన్ను కలిసి వెబ్ సిరీస్ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్ సిరీస్ చేయలేదు. కథ నచ్చడంతో ఈ ‘గాలివాన’ వెబ్ సిరీస్ చేస్తున్నా. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ చాలా చక్కగా కుదిరాయి. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇంతమంచి ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ అద్భుతంగా చేశారు. జీ5, బిబిసి కొలాబ్రేషన్లో నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్ నటి రాధికగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆమెతో చేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ ‘గాలివాన’తో ఆమెతో నటించాలనే కోరిక తీరింది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్తో పాటు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అండ్ థ్రిల్ను కలిగిస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్న నేను ఇప్పటివరకు వెబ్ సిరీస్ కథలు చేయలేదు. అయితే దర్శకుడు శరణ్ చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ ‘గాలివాన’ ప్రేక్షకులనందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. మా నార్త్ స్టార్ ప్రొడక్షన్కు ఈ ప్రాజెక్ట్ వెరీ స్పెషల్. జీ5, బిబిసిలతో కొలాబ్రేట్ అయ్యి చేస్తున్నాము. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాధిక గారు, సాయికుమార్ గారు ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నందిని రాయ్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారు. దర్శకుడు శరణ్ కథకు ఏం కావాలో అది ఆర్టిస్టుల దగ్గర నుంచి రాబట్టుకున్నాడు. మంచి ప్లాన్డ్ టెక్నీషియన్. ప్రస్తుతం జరుగుతున్న ఈ చివరి షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా గాలివాన వెబ్ సిరీస్ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు శరణ్ గోపిశెట్టి, నటుడు కృష్ణ చైతన్య, చాందిని, నందినీరాయ్, తాగుబోతు రమేష్ వంటి వారు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరగా.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ పద్మా కస్తూరి రంగన్ తెలిపారు.