కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ‘గాలివాన’ ట్రైలర్
ABN, First Publish Date - 2022-04-01T01:53:10+05:30
బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ టైటిల్తో ఒరిజినల్ సిరీస్గా జీ5 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు
బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ టైటిల్తో ఒరిజినల్ సిరీస్గా జీ5 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఏప్రిల్ 14న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ ‘గాలివాన’ వెబ్ సిరీస్ ట్రైలర్ను గురువారం సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. 1 నిమిషం 39 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ వీక్షకులను అలరిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రైలర్లోని కంటెంట్ని బట్టి చూస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు సస్పెన్స్ క్రైం థ్రిల్లర్గా ఈ వెబ్ సిరీస్ కనిపిస్తుంది. రాధిక సెంటిమెంట్ డెలాగ్స్తో పాటు ‘ఆ లం*** కొడుకు నా కంటికి కనపడితే వాడ్ని నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ హై ఎమోషన్తో చెప్పిన డైలాగ్ సిరీస్లో ప్రతీకారం అనే పాయింట్ కూడా ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది. క్వాలిటీ పరంగా, విజువల్స్ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్ సెంటిమెంట్తో కూడిన క్రైం థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్గా క్యారీ చేసేలా ఉన్నాయి. సాయికుమార్ పాత్ర కూడా చాలా బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇందులో రాధికా శరత్ కుమార్, సాయి కుమార్లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, నందిని రాయ్ వంటి వారు ఇతర పాత్రలలో నటించారు.