'అర్జున ఫల్గుణ': ఆహాలో వచ్చేసింది
ABN, First Publish Date - 2022-01-26T16:38:29+05:30
'అర్జున ఫల్గుణ' సినిమా ఆహా ఓటీటీలో వచ్చేసింది. శ్రీ విష్ణు, అమృత అయ్యర్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
'అర్జున ఫల్గుణ' సినిమా ఆహా ఓటీటీలో వచ్చేసింది. శ్రీ విష్ణు, అమృత అయ్యర్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా తెలుగు ఓటీటీ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆహా వీడియోలో ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.