Puli-Meka ఆటకి సిద్ధమవుతోన్న ఆది సాయికుమార్
ABN , First Publish Date - 2022-06-19T01:17:54+05:30 IST
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘పులి-మేక’ (Puli-Meka) ఆటకి సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరోయిన్గా జీ5 (Zee5) అసోసియేషన్లో కోన ఫిలిం కార్పోరేషన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘పులి-మేక’. గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ‘పులి-మేక’ (Puli-Meka) ఆటకి సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరోయిన్గా జీ5 (Zee5) అసోసియేషన్లో కోన ఫిలిం కార్పోరేషన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘పులి-మేక’. గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన ‘పంతం’ (Pantham) చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి (Chakravarthy Reddy K) ఈ వెబ్ సిరీస్కి దర్శకుడు. రచయిత, నిర్మాత కోన వెంకట్ మరియు ZEE5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ని తాజాగా హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు బాబీ (Bobby) క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య వెబ్ సిరీస్లు కూడా సినిమాలతో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ ‘పులి - మేక’ వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకర్ని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీతో మిళితమైన కథాంశం ఉండటం ఈ కథలో ఉన్న ప్రత్యేకత. ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ల మాదిరిగానే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు.