సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SSMB 28 : మహేశ్ మరదలుగా యంగ్ బ్యూటీ ?

ABN, First Publish Date - 2022-07-11T16:10:44+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో మూడో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో మూడో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులవుతోంది. అయితే ఇప్పటి వరకూ సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాకి ‘అర్జునుడు’ (Arjunudu) అనే టైటిల్ ఖాయం చేస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. ‘అతడు (Athadu), ఖలేజా (Khaleja)’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (Radhakrishna) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్ మరదలు పాత్రలో ‘పెళ్ళిసందD’ (Pelli SandaD) బ్యూటీ శ్రీలీల (Srileela) నటించబోతోందట. మహేశ్, శ్రీలీలపై ఒక పాట కూడా ఉండనుందని టాక్. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల ఇప్పుడు ఏకంగా మహేశ్ చిత్రంలోనే నటించబోతుండడం గొప్ప అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. త్వరలోనే శ్రీలీలను చిత్రంలోకి ఆహ్వానిస్తూ నిర్మాతలు అధికారిక ప్రకటన  ఇవ్వబోతున్నారని టాక్. ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) చిత్రం ఘనవిజయంతో మహేశ్ బాబు, ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapuramulo) బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా కావడంతో మరింతగా హైపు క్రియేట్ అయింది. 


ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత త్రివిక్రమ్‌దే. ఎందుకంటే.. మహేశ్ బాబు.. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నాడు. దాని కోసం మహేశ్ ఏకంగా మూడేళ్ళ పాటు రాజమౌళి కాంపౌండ్ లోనే లాక్ అయిపోవాలి. ఒక సినిమాకు అన్నే్ళ్ళపాటు అంకింతమైపోవడం మహేశ్ కెరీర్ లోనే తొలిసారి. దీని కోసం ఇప్పటి నుంచీ ప్రిపేర్ అవుతున్నాడు మహేశ్. అందుకే త్రివిక్రమ్ SSMB 28 చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. మరి ఆయన ప్లాన్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందేమో చూడాలి. 

Updated Date - 2022-07-11T16:10:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!