Sarkaru Vaari Paata: అయినా ఎవరూ చూడట్లేదా..?
ABN , First Publish Date - 2022-06-04T15:43:40+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా గత నెల 12 థియేటర్స్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా గత నెల 12 థియేటర్స్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. డివైడ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ళ పరంగా మాత్రం రికార్డు క్రియేట్ చేసిందని మేకర్స్ పోస్టర్స్ వదిలారు. ఈ మూవీ రెండు వారాల్లోనే రెండు వందల కోట్లు రాబట్టి... నాన్ రాజమౌళి (Rajamouli) రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. అయితే, ఎఫ్ 3 (F 3) సినిమా సందడి ఎక్కువవడంతో సర్కారు వారి పాట జోష్ కాస్త థియేటర్స్లో తగ్గింది.
దాంతో 'మురారి బావ' సాంగ్ను యాడ్ చేసిన మేకర్స్, అభిమానులని మళ్ళీ థియేటర్స్కి రప్పించాలని ప్రయత్నించారు. సర్కారు వారి పాట థియేటర్స్ వద్ద బాగానే సందడి చేస్తుండటంతో అప్పుడే ఓటీటీలో రాదనుకున్నారు. కానీ, ఊహించనివిధంగా మేకర్స్ షాక్ ఇస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని రెంటల్ బేస్ పైన రిలీజ్ చేశారు. అంటే, సర్కారు వారి పాట సినిమా చూడాలి అనుకున్నారు ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా కూడా డబ్బులు చెల్లించే సినిమాని చూడాలి. ఇందుకు 199 రూపాయలు చెల్లించాల్సిందే.
థియేటర్స్లో భారీ రేట్స్ పెట్టి సర్కారు వారి పాట సినిమాని చూసిన వాళ్ళు, ఇప్పుడు ఓటిటిలో కూడా డబ్బులు పెట్టి చూస్తారా..? అంటే అనుమానమే. సామాన్య ప్రేక్షకులే కాదు మహేశ్ ఫాన్స్ కూడా 199 పెట్టి ప్రైమ్ వీడియోలో సర్కారు వారి పాట మూవీని చూడకపోవచ్చు.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ చిత్రానికి ఓటీటీలో ఆదరణ ఎలా ఉందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ (Keerthi Suresh) నటించింది. పరశురాం (Parasuram) తెరకెక్కించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందించారు.