సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తండ్రీకొడుకులుగా Naga Chaitanya ?

ABN, First Publish Date - 2022-07-18T17:27:59+05:30

అక్కినేని తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు, నాగార్జున పలు చిత్రాల్లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. వీరిలో నాగేశ్వరరావు చాలా చిత్రాల్లో తండ్రీకొడుకులుగా అలరించి ఘనవిజయాలు అందుకున్నారు. అలాగే.. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, బంగార్రాజు’ చిత్రాల్లో తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్స్ చేసి అభిమానుల్ని మెప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు (Nageswararao), నాగార్జున (Nagarjuna) పలు చిత్రాల్లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. వీరిలో నాగేశ్వరరావు చాలా చిత్రాల్లో తండ్రీకొడుకులుగా అలరించి ఘనవిజయాలు అందుకున్నారు. అలాగే..  నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ (Soggade Chinni Nayana), బంగార్రాజు’ (Bangarraju) చిత్రాల్లో తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్స్ చేసి అభిమానుల్ని మెప్పించారు. ఇప్పుడు నాగచైతన్య (Nagachaitanya) వంతు వచ్చింది. త్వరలోనే చైతూ.. ఒక  సినిమాలో తండ్రీ కొడుకులుగా డిఫరెంట్ రోల్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు టాక్. చైతూని అలా చూపించే దర్శకుడు వేరే ఎవరో కాదు. పరశురామ్ (Parasuram). ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు పరశురామ్. తదుపరిగా నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగచైతన్య తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్టు వినికిడి. ఆ రెండు పాత్రల్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట పరశురామ్. తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా, అలాగే ట్రెండీ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందట. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. నిజానికి ‘గీతగోవిందం’ (Geetha Govindam) చిత్రం తర్వాత చైతూ హీరోగా పరశురామ్ ఒక సినిమా చేయాలి. అయితే అదే టైమ్‌లో పరశురామ్ కు మహేశ్ బాబు (Mahesh Babu) తో సర్కారువారి పాట చిత్రం ఓకే అయింది. ఆ కారణంగా నాగచైతన్యతో సినిమా వర్కవుట్ కాలేదు. 


ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ (Thankyou) విడుదల హడావిడిలోనూ, వెబ్ సిరీస్ ‘దూత’ (Dootha) చిత్రీకరణలోనూ ఉన్నాడు. ఈ రెండూ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పరశురామ్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. మరి నిజంగానే చైతూ ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-18T17:27:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!