తాత పేరు టైటిల్గా Naga Chaithanya కొత్త చిత్రం..
ABN, First Publish Date - 2022-05-25T14:29:08+05:30
అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaithanya) దర్శకుడు పరశురామ్ (Parasuram) కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం.
అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaithanya) దర్శకుడు పరశురామ్ (Parasuram) కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rshmika Mandanna) జంటగా పరశురామ్ గీత గోవిందం (Geetha Govidam) చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేశ్ (Keerthi Suresh) జంటగా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాను రూపొందించగా, మే 12న భారీగా విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ను అందుకుంది.
ఈ క్రమంలో పరశురామ్ తన నెక్స్ట్ సినిమాను అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్వయంగా పరశురామ్ వెల్లడించాడు కూడా. అయితే, ఈ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న సినిమాకు నాగ చైతన్య తాత పేరునే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లెజండరీ హీరోలలో అక్కినేని నాగేశ్వరావు ఒకరు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నాగేశ్వర రావు పౌరాణిక, జానపద చిత్రాలతో పాటు మల్టీస్టారర్ చిత్రాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. కొడుకు నాగార్జున మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్లతో కలిసి ఈ సినిమాను చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు అనే టైటిల్తో నాగ చైతన్య సినిమా చేయబోతుండటం విశేషమనే చెప్పాలి. అయితే, ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా, చైతు నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అలాగే, డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు చైతు.