సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మామాఅల్లుళ్ళ చిత్రంలో Heroine ఎవరు ?

ABN, First Publish Date - 2022-06-14T17:10:53+05:30

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కాంబినేషన్‌లో.. తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘వినోదయ చిత్తం’ (Vinodaya sittam) రీమేక్ కాబోతోందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకూ రాకపోవడంతో ప్రాజెక్ట్ లేదేమోననే సందేహాలు తలెత్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కాంబినేషన్‌లో.. తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘వినోదయ చిత్తం’  (Vinodaya sittam) రీమేక్ కాబోతోందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకూ రాకపోవడంతో ప్రాజెక్ట్ లేదేమోననే సందేహాలు తలెత్తాయి. అయితే ప్రకటన త్వరలోనే రాబోతోందని, సినిమా పక్కగా ఉంటుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తినెలకొంది. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సముద్రఖని (SamudraKhani) నే ఈ సినిమాని రూపొందిస్తారని టాక్. సోషియో ఫాంటసీ కథాంశంతో సముద్రఖని, తంబిరామయ్య (Thambi Ramayya) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను ఇప్పటికే పలువురు చూడడం మొదలు పెట్టారు. ఇక తెలుగు వెర్షన్‌లో నటించడానికి పవన్ కు 20 రోజులు డేట్స్ సరిపోతాయట. అందుకే ఆయన మేనల్లుడు సాయిధరమ్ తో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. 


అర్దంతరంగా చనిపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆత్మ రూపంలో పైకి వెళ్ళిపోతాడు. అక్కడ అతడికి ‘టైమ్’ (Time) అనే వ్యక్తి కనిపిస్తాడు.  ఈ టైమ్ లో తను చనిపోవడం చాలా బాధగా ఉందని , భూమ్మీద తను నెరవేర్చాల్సిన పనులు చాలా ఉన్నాయని టైమ్ కు తన గోడును తెలుపుతాడు. దానికి టైమ్ అతడికి మూడు నెలలు టైమిచ్చి.. పని పూర్తి చేసుకు రమ్మని తిరిగి భూమ్మీదకు పంపుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడు అనేదే ‘వినోదయ చిత్తం’ మిగతా కథ. ఇందులో టైమ్ గా సముద్రఖని నటించగా.. ప్రభుత్వ ఉద్యోగిగా తంబిరామయ్య నటించాడు. నవ్విస్తూనే ఒక చక్కటి సందేశాన్ని ఈ సినిమాతో ఇచ్చాడు దర్శకుడు.  తెలుగు వెర్షన్‌లో సముద్రఖని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తుండగా.. తంబిరామయ్య పాత్రను సాయిధరమ్ తేజ్ చేస్తుండడం విశేషం. 


ఇక ఈ సినిమాలో కథానాయికగా అందాల కేతిక శర్మ (Kethika Sharma) నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ‘రొమాంటిక్ (Romantic), లక్ష్య (Lakshya)’ చిత్రాల్లో నటించి గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కేతిక.. ఇప్పుడు మెగా మామా అల్లుళ్ళ చిత్రంలో కథానాయికగా ఛాన్స్ కొట్టేయడం విశేషంగా మారింది. ఆల్రెడీ ఆమె వైష్ణవ్‌తేజ్ (Vaishnav Tej) సరసన ‘రంగరంగ వైభవంగా’ (Rangaranga Vaibhavamga) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఇలా అన్న దమ్ముల చిత్రాల్లో కథానాయికగా కేతిక నటిస్తుండడం మరీ విశేషం. జూలై సెకండ్ వీక్ లో చిత్రం మొదలు కానుందట. ముందుగా పవన్ కళ్యాణ్ పాత్ర కు సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుందని వినికిడి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-06-14T17:10:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!