Keerthi Suresh: మరోసారి తల్లి పాత్రలో..?
ABN , First Publish Date - 2022-04-02T15:35:17+05:30 IST
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్గా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వాకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దాంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ దక్కించుకోవాలని కసితో ఉన్నాడు.
ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. డిఫరెంట్ జోనర్లో తెరకెక్కనున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో కీర్తి సురేశ్ తల్లిపాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంతకముందు కీర్తి పెంగ్విన్ సినిమాలో తల్లి పాత్రను పోషించింది. ఓటీటీలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, తాజా సినిమాలో ముందు ఈ పాత్రకు కృతి శెట్టిని తీసుకోవాలని మేకర్స్ సంప్రదించారట. అయితే, కెరీర్ బిగినింగ్లోనే తల్లిపాత్ర చేస్తే మైనస్ అవుతుందని ఆమె ఈ సినిమాకు నో చెప్పిందట. దాంతో ఈ ప్రాజెక్ట్లోకి కీర్తి వచ్చి చేరినట్టు తెలుస్తోంది. కాగా, మహానటి సినిమా తర్వాత కీర్తి ఖాతాలో ఒక్క హిట్ పడకపోయినా కూడా చేతిలో మాత్రం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటోంది.
