SS Rajamouli: జక్కన్నపై డాక్యుమెంటరీ రాబోతుందా..?

ABN , First Publish Date - 2022-10-08T01:02:30+05:30 IST

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

SS Rajamouli: జక్కన్నపై డాక్యుమెంటరీ రాబోతుందా..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli). ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో వరల్డ్ వైడ్‌గా అందరికి చేరువయ్యాడు. శాంతినివాసం అనే సీరియల్‌ డైరెక్టర్‌గా కెరీర్  ప్రారంభించి అంచెలంచెలుగా ఎవరికి అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. తాజాగా జక్కన్నకు సంబంధించిన ఓ అప్‌డేట్ నేషనల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..  

  

రాజమౌళిపై డాక్యుమెంటరీ రాబోతుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో అందుకు సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టారని సమాచారం. తన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికి జక్కన్న కూడా ఈ  ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నాడని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ మరి కొన్ని నెలల పాటు కొనసాగబోతుందట. రాజమౌళి ఫిలిం మేకింగ్ స్టైల్, ఘనతలను ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. రివర్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ ఖన్నా ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నాడు. హీరోలతో సంబంధం లేకుండా దర్శకధీరుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఈ డాక్యుమెంటరీ ఘన విజయం సాధిస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రాజమౌళి చివరగా ‘ఆర్ఆర్ఆర్’ కు దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వరల్డ్‌వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి విదేశీ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అందువల్ల ఈ చిత్రం జనరల్ కేటగీరీలో ఆస్కార్ బరిలోకి దిగింది. రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు ఇదేనని తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో జక్కన్న చెప్పాడు.

Updated Date - 2022-10-08T01:02:30+05:30 IST