మరో రీమేక్కి మెగాస్టార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారా?
ABN , First Publish Date - 2022-03-20T02:54:54+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన విజయ్ నటించిన తమిళ చిత్రానికి రీమేక్ అయిన ‘ఖైదీ నెంబర్ 150’తో అనే విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ వంటి..
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన విజయ్ నటించిన తమిళ చిత్రానికి రీమేక్ అయిన ‘ఖైదీ నెంబర్ 150’తో అనే విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ వంటి డైరెక్ట్ చిత్రాలు చేశారు చిరంజీవి. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆచార్య’ తర్వాత వరుసగా రెండు రీమేక్ చిత్రాలకు ఓకే చెప్పిన చిరు... డైరెక్టర్ బాబీ, వెంకీ కుడుమలతో మరో రెండు స్ట్రయిట్ చిత్రాలకి ఓకే చెప్పారు. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి రీమేక్గా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్న చిరు.. బాబీతో, వెంకీ కుడుమలతో స్ట్రయిట్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి కాకుండా మరో మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది.
మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘బ్రోడాడి’ చిత్రాన్ని చిరు రీమేక్ చేయబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్లో వార్తలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రం చేస్తుందని ఒకసారి.. వెంకీ-రానాలు చేస్తున్నారని మరోసారి ఇలా అనేకమార్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్ మెగా గూటికి చేరినట్లుగా టాక్ నడస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందనేది తెలియాలంటే.. మెగాస్టార్ స్పందించే వరకు వెయిట్ చేయక తప్పదు.