Bheemla nayak: ఇందులో నిజమెంత..?
ABN , First Publish Date - 2022-01-16T17:22:36+05:30 IST
తాజాగా 'భీమ్లా నాయక్' చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ యాక్షన్ మల్టీస్టారర్గా రూపొందుతున్న ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్
తాజాగా 'భీమ్లా నాయక్' చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ యాక్షన్ మల్టీస్టారర్గా రూపొందుతున్న ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకి పార్ట్ పూర్తవగా ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే, చిత్రయూనిట్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని..ఈ నేపథ్యంలో చిత్రీకరణను నిలిపివేశారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ, ఫిబ్రవరి 25న మహా శివరాత్రి పండుగరోజు రిలీజ్ కావాల్సిన 'భీమ్లా నాయక్' దీని కారణంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఈ విషయంలో స్పందించి క్లారిటీ ఇస్తారేమో. ఇక త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. థమన్ సంగీత దర్శకుడు.