సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: ఆ యాడ్‌ను రిజెక్ట్ చేసిన బన్నీ.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-08-11T00:17:30+05:30

టాలీవుడ్ టాప్ హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఉత్తరాది వారికి చేరువయ్యాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రంతో భారత్ అంతటా అభిమానులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ టాప్ హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఉత్తరాది వారికి చేరువయ్యాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రంతో భారత్ అంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అతడిని ప్రచారకర్తగా నియమించుకోవాలని అనేక బ్రాండ్స్ భావిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో.. లిక్కర్, గుట్కా బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్‌ నిరాకరించాడట. భారీగా రెమ్యూనరేషన్ ఇస్తామన్నా అందుకు అంగీకరించలేదట.    


ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి రూ. 7.5కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నాడు. రెడ్ బస్, కోకా కోలా, అస్ట్రాల్, కేఎఫ్‌సీ, జోమాటో తదితర బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ‘పుష్ప’ విజయంతో భారత్‌లోని టైర్-2, టైర్-3 మార్కెట్స్‌లోకి కూడా బన్నీ చొచ్చుకెళ్లాడు. అతడి స్టార్‌డమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా వివిధ బ్రాండ్‌లు అతడిని ప్రచారకర్తగా నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఓ గుట్కా బ్రాండ్, లిక్కర్ కంపెనీ తమకు బ్రాండ్ అంబాసిండర్‌గా వ్యవహరించాలని అల్లు అర్జున్‌ను కోరాయి. రూ. 10కోట్లను రెమ్యూనరేషన్‌గా చెల్లిస్తామని పేర్కొన్నాయి. అయినప్పటికీ బన్నీ ఈ ఆఫర్స్‌ను తిరస్కరించాడట. ‘‘అల్లు అర్జున్‌ను ఓ గుట్కా బ్రాండ్, లిక్కర్ కంపెనీ సంప్రదించాయి. ప్రచారకర్తగా వ్యవహరించమన్నాయి. కానీ, అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. గుట్కా, లిక్కర్ బ్రాండ్స్, సరోగేట్స్ ప్రచారాలకు బన్నీ వ్యతిరేకం’’ అని అల్లు అర్జున్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. ‘పుష్ప’ సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు సుకుమార్ (Sukumar) ఇప్పటికే  స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సమ్మె పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘పుష్ప-2’ లో రష్మిక మందన్న (Rashmika Mandanna), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలు పోషించనున్నారు.

Updated Date - 2022-08-11T00:17:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!