'పుష్ప పార్ట్ 2': అప్పుడే భారీ ఆఫర్..?
ABN, First Publish Date - 2022-01-23T15:53:47+05:30
'పుష్ప పార్ట్ 2' చిత్రానికి అప్పుడే భారీ ఆఫర్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న 5 భాషలలో వచ్చిన ఈ సినిమా ఊహించని సక్సెస్ అందుకుంది. హీరోగా అల్లు అర్జున్,
'పుష్ప పార్ట్ 2' చిత్రానికి అప్పుడే భారీ ఆఫర్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న 5 భాషలలో వచ్చిన ఈ సినిమా ఊహించని సక్సెస్ అందుకుంది. హీరోగా అల్లు అర్జున్, డైరెక్టర్గా సుకుమార్లకు పాన్ ఇండియన్ స్టార్స్గా క్రేజ్ వచ్చేసింది. ఇక దీనికి సీక్వెల్గా 'పుష్ప పార్ట్ 2' రాబోతోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తునారు. అయితే, ఇంకా షూటింగ్ కూడా మొదలవకుండానే 'పుష్ప పార్ట్ 2' థియేట్రికల్ రైట్స్ కోసం 400 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఓ ప్రముఖ సంస్థ ఆఫర్ చేసిందట. కానీ, మేకర్స్ ఈ డీల్కు ఒప్పుకోలేదని సమాచారం. కాగా, ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.