ఒంటరితనం ఏం నేర్పింది?
ABN , First Publish Date - 2022-09-28T11:47:58+05:30 IST
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, రాకేశ్ మాస్టర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్కై’. పృథ్వీ పేరిచర్ల దర్శకుడు...
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, రాకేశ్ మాస్టర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్కై’. పృథ్వీ పేరిచర్ల దర్శకుడు. నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది..? ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అవి తనని ఏ దారిలో నడిపిస్తాయి? అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. మావవీయ కోణాల్ని సృశిస్తుంది. రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం అదనపు ఆకర్షణ’’ అన్నారు.