పాన్ ఇండియా మూవీలో జాయిన్ అయిన జయమ్మ

ABN , First Publish Date - 2022-01-21T14:17:52+05:30 IST

'క్రాక్' సినిమాలో జయమ్మగా నటించి టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ తాజాగా 'మైఖేల్' అనే పాన్ ఇండియా మూవీలో జాయిన్ అయ్యారు

పాన్ ఇండియా మూవీలో జాయిన్ అయిన జయమ్మ

'క్రాక్' సినిమాలో జయమ్మగా నటించి టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ తాజాగా 'మైఖేల్' అనే పాన్ ఇండియా మూవీలో జాయిన్ అయ్యారు. తెలుగులో 'క్రాక్‌'తో పాటు అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'నాంది' సినిమాలోనూ లాయర్ పాత్రలో నటించి మెప్పించారు వరలక్ష్మీ. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మలినేని, బాలకృష్ణ మూవీ అలాగే, సమంత నటిస్తున్న 'యశోద' చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో సందీప్ కిషన్, తమిళ విలక్షణ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మైఖేల్' చిత్రంలో నటించే అవకాశం అందుకున్నారు. 


తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్, విలన్ పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంస్థలు కలిసి రూపొందిస్తున్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-01-21T14:17:52+05:30 IST