OTT: ఈ వారం సందడి చేసే చిత్రాలివే!
ABN , First Publish Date - 2022-05-16T22:31:43+05:30 IST
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికల్లో అలరించడానికి చాలా చిత్రాలు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో ఇప్పటికే సందడి చేసిన ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉండబోతున్నాయి.
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికల్లో అలరించడానికి చాలా చిత్రాలు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో ఇప్పటికే సందడి చేసిన ‘ఆర్ఆర్ఆర్’(RRR), ‘ఆచార్య’(Acharya) చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉండబోతున్నాయి.
మలయాళ హిట్ చిత్రం ‘జోసెఫ్’కు రీమేక్గా తెరకెక్కిన చిత్రం ‘శేఖర్’(Shekar). రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో రాజశేఖర్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. తనకంటూ ఎవరూ లేని ఓ వ్యక్తి.. తనకు ఎదురైన సమస్యలపై ఒంటరిగా ఎలా పోరాడాడు అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం మనసున్న ప్రతి ఒక్కరనీ కదిలిస్తుందని దర్శకురాలు జీవితా రాజశేఖర్ చెప్పారు. ఈ చిత్రానికి అనూస్ రూబెన్స్ సంగీతం అందించారు.
‘ధాకడ్’: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్(Kangana ranauth) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ధాకడ్’. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా రనౌత్ నటించారు. ఉత్కంఠభరితమైన పోరాటాలతో శక్తిమంతమైన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు.
ధగడ్సాంబ: సంపూర్ణేష్బాబు(Sampoornesh babu), సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘దగడ్సాంబ’ ఈ నెల 20న విడుదల కానుంది. ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబం మొత్తం చూసేలా ఈ చిత్రం ఉంటుందని సంపూర్ణేశ్ బాబు చెప్పారు.
ఓటీటీలో సందడే సందడి...
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. టీ వోడ్ పద్థతిలో అద్దె చెల్లించి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.
ఆచార్య: భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య చిత్రం అభిమానులను నిరుత్సాహపరచింది. చిరంజీవి, రామ్చరణ్ కీలక పాత్రధారులుగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ నెల 20 నుంచి స్ర్టీమింగ్ కానుంది.
‘భళా తందనాన’: శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి తెరకెక్కించిన ‘భళా తందనాన’(Bhala Tandanana) చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో దర్శనమివ్వనుంది. మే 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రానున్న శుక్రవారం ఓటీటీలో విడుదలవుతోంది.
12th మ్యాన్: మోహన్లాల్ హీరోగా నటించిన ‘12th Man’ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ కానుంది. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20 చి?స్నీ+హాట్స్టార్లో విడుదల కానుంది.
‘పంచాయత్ –2’: లాక్డౌన్లో వీక్షకులను ఎంతగానో అలరించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్కు కొనసాగింనుగా సీజన్ 2 రాబోతుంది. దీపక్ మిశ్ర దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్లో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా కీలక పాత్రధారులు. మే 20 నుంచి ‘పంచాయత్ –2’ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ర్టీమింగ్ కానుంది.