Bigg Boss 6: రెండు జంటలే కానీ.. ట్రయాంగిల్ లవ్స్టోరి!
ABN, First Publish Date - 2022-09-24T02:55:20+05:30
బిగ్బాస్ హౌస్లో లవ్ ట్రాక్లు సహజం. సీజన్3లో రాహుల్ సిప్లిగంజ్ – పునర్నవి భూపాలం జోడీగా సెట్ అయ్యారు. ఆ తర్వాతి సీజన్లో అఖిల్ కార్తీక్కు, మోనల్కు ట్రాక్ సెట్ అయింది. ప్రస్తుతం నడుస్తున్న ఆరో సీజన్లో కూడా రెండు లవ్ ట్రాక్లు కనిపిస్తున్నాయి.
బిగ్బాస్ హౌస్(Biggboss 6)లో లవ్ ట్రాక్లు (Love track)సహజం. సీజన్3లో రాహుల్ సిప్లిగంజ్ – పునర్నవి భూపాలం జోడీగా సెట్ అయ్యారు. ఆ తర్వాతి సీజన్లో అఖిల్ కార్తీక్కు, మోనల్కు ట్రాక్ సెట్ అయింది. ప్రస్తుతం నడుస్తున్న ఆరో సీజన్లో కూడా రెండు లవ్ ట్రాక్లు కనిపిస్తున్నాయి. ఒకటి సూర్య–ఆరోహి అయితే.. రెండోది అర్జున్ (Arjun)–శ్రీసత్య(Sri satya). ఉన్నవి రెండే అయినా ఓ జంటలో మాత్రం ట్రయాంగిల్ లవ్స్టోరీ కనిపిస్తోంది. శ్రీసత్యకు, అర్జున్ కల్యాణ్కు మధ్య ఏదో నడుస్తుందనే విషయం హౌస్ మొత్తం బ్రాడ్కాస్ట్ అయింది. ఇదే సీజన్లో మరో నటి వాసంతి క్రిష్ణన్ కూడా ఉంది. అయితే హౌస్లో ఉన్న లవ్ ట్రాక్ల గురించి నేహా, శ్రీహాన్ మాట్లాడుకున్నారు. అర్జున్కి శ్రీసత్య మీద ఏదో ఫీలింగ్ ఉందని, కానీ శ్రీసత్య, అర్జున్ని పట్టించుకోవడం లేదని శ్రీ హాన్ అంటాడు. మరి వాసంతి పట్ల కూడా అర్జున్ అలాగే బిహేవ్ చేస్తున్నాడని నేహా అంటోంది. నాకు అలాగే అనిపిస్తోందని శ్రీహాన్ అంటాడు. ఏంటి ట్రైయాంగీల్ లవ్ స్టోరీ నడుస్తోందా అంటూ కామెంట్ చేస్తోంది నేహా చౌదరి. ‘కొన్ని కంట్రోల్ చేసుకోరా’ అని నేను ఎప్పుడు చెబుతుంటాను. అతను వినడు అని శ్రీహాన్ అంటాడు. అర్జున్ని హర్ట్ చేయడం కోసం అన్నయ్య అంటుంటుంది అని నేహకు చెబుతాడు శ్రీహాన్. అయితే ఇంట్లో ఆట ఆడటానికి ఇలా ఉంటున్నారా? లేక నిజంగా ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా అన్నది తెలియడం లేదు అంటూ చిన్న మెలిక పెడుతోంది నేహా. అది ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేదా అన్నది చూడాలి.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు ‘ఎత్తర జెండా’ అంటూ కొత్త కెప్టెనీ టాస్క్ ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ టాస్క్లో కుప్పగా ఉన్న ఇసుకను ఓ చిన్న బకెట్తో తీసుకెళ్లి మరోచోట ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి. ఇలా ముగ్గురికి మూడు డబ్బాలు ఏర్పాటు చేయగా.. ఎవరు ముందుగా డబ్బాను ఇసుకతో నింపితే.. వాళ్లే బిగ్ బాస్ హౌస్కు కొత్త కెప్టెన్ అవుతారు. ఈ టాస్క్లో గెలిచి కెప్టెన్ అయ్యేందుకు ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య ముగ్గురు బాగానే కష్టపడ్డారు. ఆదిరెడ్డి డబ్బాను ఇసుకతో నింపడంతో కొత్త కెప్టెన్గా ఎన్నికయ్యాడు. కొత్తగా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన ఆదిరెడ్డి ఇంటి సభ్యులకు కిచెన్, హాల్, బాత్రూమ్ పనులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పనిని వారి అంగీకారంతో అప్పగించాడు. రేషన్ మేనేజర్గా బాలాదిత్య ఎంపిక చేశారు. ఇంట్లో ఎంతో నిజాయతీగా ఉంటూ అందరితో ప్రేమగా ఉన్న కీర్తిభట్కు ఓట్లు పడలేదని టాస్క్ పూర్తయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటుంది. వాసంతి ఓదార్చడానికి ప్రయత్నం చేయగా అక్కడి నుంచి వాష్ రూమ్కి వెళ్తుంది కీర్తి. ఆ తర్వాత ఆరోహి వచ్చి.. ‘నువ్వు బాధపడడంలో న్యాయం ఉంది. అందరితో జెన్యూన్గా ఉన్నావ్... ప్రేమను పంచుతున్నావ్’ అనగానే మరోసారి భావోద్వేగానికి గురైంది కీర్తి.