సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఏపీ సియంతో సమావేశానికి వెళ్ళింది వీళ్లే !

ABN, First Publish Date - 2022-02-10T16:28:06+05:30

చిత్ర పరిశ్రమకు రాయితీలు, కళాకారులకు ప్రోత్సాహాలు, సినిమా టికెట్ల ధరల అంశంపై ఈ రోజు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బృందం మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోబోతున్నారు. చిరంజీవితో పాటు అగ్ర కథానాయకులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి ఇంకా.. పలువురు దర్శకులు, నిర్మాతలు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్ర పరిశ్రమకు రాయితీలు, కళాకారులకు ప్రోత్సాహాలు, సినిమా టికెట్ల ధరల అంశంపై ఈ రోజు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బృందం  మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోబోతున్నారు. చిరంజీవితో పాటు అగ్ర కథానాయకులు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి ఇంకా.. పలువురు దర్శకులు, నిర్మాతలు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు రన్ వే నుండి నేరుగా ప్రత్యేక వాహనాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.  ఇప్పటికే నటుడు ఆర్.నారాయణ మూర్తి, ఆలి, పోసాని విజయవాడ చేరుకున్నారు. అయితే ఈ బృందంలో నాగార్జున లేకపోవడం గమనార్హం.  ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఉమ్మడి విలేకరుల సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-10T16:28:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!