బెల్లంకొండ సురేశ్‌పై కేసు కథ ముగిసింది..!

ABN , First Publish Date - 2022-03-17T17:03:59+05:30 IST

అప్పుగా తీసుకున్న రూ.85 లక్షలు ఇవ్వడం లేదని సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై సీసీపీఎస్‌లో ఫిర్యాదు చేసిన వ్యాపారి శరణ్‌ కేసు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

బెల్లంకొండ సురేశ్‌పై కేసు కథ ముగిసింది..!

అప్పుగా తీసుకున్న రూ.85 లక్షలు ఇవ్వడం లేదని సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై సీసీపీఎస్‌లో ఫిర్యాదు చేసిన వ్యాపారి శరణ్‌ కేసు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ‘నా డబ్బులు తిరిగి వచ్చేశాయి... కేసు వెనక్కి తీసుకుంటున్నాను’.. అని ఆయన ప్రకటించారు. వారం రోజుల క్రితం ఫిర్యాదు ఆధారంగా సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌, అతని కుమారుడు సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివా‌స్‌పై చీటింగ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్‌ మీడియా సమావేశంలో శరణ్‌ అన్యాయంగా కేసు పెట్టాడని చెప్పడం గమనార్హం. అంతలోనే కేసు అనూహ్యంగా ముగిసింది. బెల్లంకొండ సురేష్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శరణ్‌ బుధవారం ప్రకటించారు. తర్వాత లోక్‌ అదాలత్‌ ద్వారా కేసును పరిష్కరించుకుంటామన్నారు.

Updated Date - 2022-03-17T17:03:59+05:30 IST