Suman: నేను క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందవద్దు..
ABN , First Publish Date - 2022-08-31T15:02:20+05:30 IST
నేను క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందవద్దు..అని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్లపై స్పందించారు నటుడు సుమన్ (Suman). ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు
'నేను క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందవద్దు'..అని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్లపై స్పందించారు నటుడు సుమన్ (Suman). ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వచ్చి నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో సుమన్ అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారు. అసలు విషయం తెలుసుకున్న సుమన్..నేను బాగానే ఉన్నానని, ఆందోళన చెందవద్దు అని తెలిపారు.
ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రేక్షకులు, ఆయన అభిమానులను నార్త్ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వార్తలు ఆందోళనకు గురి చేశాయి. సుమన్ మరణించారని నార్త్ యూట్యూబ్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. సన్నిహితుల ద్వారా ఈ విషయం ఆయనకు తెలిసింది. ఫేక్ న్యూస్ను ఆయన ఖండించారు. "నిరాధారమైన, ప్రేక్షకులకు ఆందోళనకు గురి చేసే ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి మోసపూరిత ఛానళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్నాను"..అని తెలిపారు.