Nayattu: రీమేక్లో రాజశేఖర్ కుమార్తెకు ఛాన్స్
ABN , First Publish Date - 2022-08-31T01:06:26+05:30 IST
మలయాళం హిట్ సినిమా ‘నయట్టు’ (Nayattu) మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. పెద్ద నిర్మాణ సంస్థ అయినా గీతా ఆర్ట్స్ (Geetha Arts) వాళ్ళు ఈ సినిమా రీమేక్ హక్కులు సంపాదించారు. గత ఏడాది ఈ సినిమాని రీమేక్ చేయడానికి అన్నీ
మలయాళం హిట్ సినిమా ‘నయట్టు’ (Nayattu) మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. పెద్ద నిర్మాణ సంస్థ అయినా గీతా ఆర్ట్స్ (Geetha Arts) వాళ్ళు ఈ సినిమా రీమేక్ హక్కులు సంపాదించారు. గత ఏడాది ఈ సినిమాని రీమేక్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని.. చివరి నిమిషంలో రద్దు చేశారు. రీమేక్ చేయడం లేదు.. చేసే ఉద్దేశం లేదు అని ఊరుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడదే సంస్థ ఈ సినిమాని మణికాంత్ గెల్లి (Manikanth Gelli) దర్శకత్వంలో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని తెలిసింది.
మణికాంత్ ఇంతకుముందు ‘తెల్లవారితే గురువారం’ (Thellavarithe Guruvaram) అనే సినిమా చేశాడు. ‘నయట్టు’ తెలుగు రీమేక్లో ఒక ప్రధాన పాత్రలో డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) నటిస్తోంది. ఆమె ఒక పోలీస్ పాత్రలో కనిపించనుంది. ఇంకా మిగతా పాత్రల్లో రాహుల్ విజయ్ (Rahul Vijay), అలాగే సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) కూడా నటించనున్నారు. వీరందరూ కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కూడా ఒక ప్రధాన పాత్రలో ఇందులో పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ వాళ్ళు ఇంతకు ముందు భారీ బడ్జెట్తో చేద్దామనుకున్న ఈ సినిమాని, ఇప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్లో చేస్తున్నట్టుగా తెలిసింది.
మలయాళం సినిమా ‘నయట్టు’ చిత్ర విషయానికి వస్తే.. ఇది కొంచెం డార్క్ స్టోరీ. ట్రిబె జాతికి చెందిన ఒక యువకుడు అనుమానాస్పదంగా మరణించటంతో.. రాజకీయ పార్టీలు ఆ విషయాన్ని ఎలా ఉపయోగించుకున్నారనే కథాంశంతో రూపొందించారు. రాహుల్ విజయ్ ఈ మధ్య కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకని అతన్ని ఇందులో తీసుకున్నారని తెలిసింది.