శశి కిరణ్ తిక్క ముఖ్య అతిథిగా ‘సైదులు’ ట్రైలర్ లాంచ్
ABN, First Publish Date - 2022-04-18T18:42:53+05:30
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘సైదులు’ . కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై, బాబా పీఆర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఇందులో కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు.
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘సైదులు’. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై, బాబా పీఆర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఇందులో కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా.. దర్శకుడు చంద్ర మహేష్, దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు.
డైరెక్టర్ శశి కిరణ్ మాట్లాడుతూ...సైదులు సినిమా ట్రైలర్ రియాలిటీకీ దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడాలి, మరిన్ని రావాలి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు. అలాగే.. నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం, డైరెక్టర్ బాబా పి.ఆర్ ఈ సినిమా విశేషాల్ని తెలుపుతూ.. ‘సైదులు’ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ కు, నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమా అందరికీ చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు.