'సైదులు' ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ఎప్పుడంటే..
ABN, First Publish Date - 2022-04-10T19:12:35+05:30
బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సైదులు'. ఇందులో రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించారు. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న
బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సైదులు'. ఇందులో రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించారు. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు. ఘనంగా జరిగే ఈ ఈవెంట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.
హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం జరిగింది. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఓ కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు.