Sai tej: శరవేగంగా SDT 15
ABN , First Publish Date - 2022-06-13T20:25:17+05:30 IST
గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సాయితేజ్ మళ్లీ షూటింగ్లతో బిజీ అయ్యారు. కార్తిక్ దండు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. బీవీయస్యన్ ప్రసాద్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ నిర్మాతలుగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సాయితేజ్ (Sai tej)మళ్లీ షూటింగ్లతో బిజీ అయ్యారు. కార్తిక్ దండు (Karthik dandu)దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. బీవీయస్యన్ ప్రసాద్(Bvsn prasad), క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్(Sukumar) నిర్మాతలుగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన హీరో కథే ఈ సినిమా. హీరో లుక్తోపాటు ‘సిద్థార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే’ అంటూ పోస్టర్ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి.
సాయి కెరీర్లో చేస్తున్న ఫస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ ఇది. ఆయన ఫ్యాన్స్తోపాటు, సినీ వర్గాల్లోనూ ఆ ఎగ్జయిట్మెంట్ కనిపిస్తోంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 25 రోజుల్లో 30 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి ‘రుద్రవనం’(Rudravanam) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ విషయంపై నిర్మాణ సంస్థలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో చిత్ర బృందం టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.