Sai Pallavi: సూపర్ స్టార్ కోసం సాయి పల్లవి అలా..!

ABN , First Publish Date - 2022-05-17T19:48:21+05:30 IST

ఫిదా (Fida) సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి (Sai Pallavi) మొదటి సినిమాతోనే నేచురల్ పర్ఫార్మర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Sai Pallavi: సూపర్ స్టార్ కోసం సాయి పల్లవి అలా..!

ఫిదా (Fida) సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి (Sai Pallavi) మొదటి సినిమాతోనే నేచురల్ పర్ఫార్మర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంసిఏ (MCA), పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu) చిత్రాలలో నటించింది. ఇక ఇటీవల ల‌వ్‌స్టోరీ (Love Story), శ్యామ్ సింగ‌రాయ్ (Syam Singha Roy) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకున్న‌ సాయి ప‌ల్ల‌వి... త‌ర్వ‌లోనే 'విరాట ప‌ర్వం' (Virata Parvam)తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. యాక్టింగ్‌కు స్కోప్ ఉండి, స్కిన్ షోకి దూరం ఉండే రోల్స్ ఎక్కువగా చేయడం సాయి పల్లవి ప్రత్యేకత. 


అయితే, తాజాగా ఒక సినిమాని చూడడానికి దొంగ‌లా మారింది. గతంలో 'శ్యామ్ సింగ‌రాయ్‌' సినిమాని చూడడానికి వెళ్ళిన సాయి పల్లవి, తనని ఎవరూ గుర్తు పట్టకుండా బుర్ఖా వేసుకొని థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులతో కలిసి సినిమా చూసింది. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప‌నే చేసింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌' మూవీ మే 12న రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని భావించిన సాయి ప‌ల్ల‌వి.. ముఖమంతా కవర్ అయ్యేలా స్కార్ఫ్‌తో కప్పేసి, మాస్క్ ధరించి హైదరాబాద్‌లోని ఆర్కే సీనీ మల్టీప్లెక్స్‌లో సినిమాను చూసింది. 


సినిమా పూర్తయ్యాక బయటకి వచ్చిన సాయి పల్లవి, తనని ఎవరూ గుర్తు పట్టకుండా కారెక్కి వెళ్లిపోయింది. ముసుగులో కానీ, కోవిడ్ కిట్‌లో ఉన్నా హీరోయిన్స్‌ను గుర్తు పట్టే ఆడియన్స్ కెమెరాలు, సాయి పల్లవి చూడగానే క్లిక్ మన్నాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మిగత వారిలాగా స్పెషల్ షో వేసుకోని సినిమా చూడకుండా, ఇలా ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడాలి.. అనే సాయి పల్లవి ఆలోచన చాలా బాగుంది. 

Updated Date - 2022-05-17T19:48:21+05:30 IST