విరాట పర్వం ఓటీటీ స్ట్రీమింగ్పై Sai Pallavi ఇంట్రెస్టింగ్ పోస్ట్..
ABN , First Publish Date - 2022-07-01T20:36:43+05:30 IST
టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu UDugula) దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా.. ప్రియమణి (Priyamani), నందితా దాస్ (Nanditha Dass),
టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu UDugula) దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా.. ప్రియమణి (Priyamani), నందితా దాస్ (Nanditha Dass), నివేతా పేతురాజ్ (Nivetha Pethuraaj) ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). ఈ నెల 17న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. కమర్షియల్గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. అంతేకాదు, ‘విరాట పర్వం’ వారం రోజుల్లోనే థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఈ చిత్రాన్ని విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో చిత్ర హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘విరాట పర్వం సినిమాలో చేసిన వెన్నెల పాత్ర నేను ఇప్పుడు వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని పాత్ర.. ఆ రోల్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను’.. అని తెలిపారు. ఈ సందర్భంగా ‘విరాట పర్వం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది.. అందరూ చూడాలి’ అని కోరారు. ప్రస్తుతం సాయి పల్లవి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, నక్సల్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ మూవీలో కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. సాయి పల్లవి గత చిత్రం లవ్ స్టోరి సూపర్ హిట్గా నిలిచింది. ఆ ఇంపాక్ట్ విరాట పర్వం ఉన్నాకూడా కథ కథనం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మరి, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.