శ్రీవారి తోమాలసేవలో Rashi Khanna
ABN, First Publish Date - 2022-06-29T15:33:55+05:30
హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) తాజాగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. త్వరలో ఆమె హీరోయిన్గా నటించిన పక్కా కమర్షియల్ (Pakka Commercial) చిత్రం రిలీజ్ కాబోతోంది.
హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) తాజాగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. త్వరలో ఆమె హీరోయిన్గా నటించిన పక్కా కమర్షియల్ (Pakka Commercial) చిత్రం రిలీజ్ కాబోతోంది. మారుతి (Maruthi) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటించారు. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు చేరుకున్న రాశిఖన్నా, శ్రీవారి తోమాలసేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇక పక్కా కమర్షియల్ సక్సెస్ హీరో గోపీచంద్, దర్శకుడు మారుతిలకు తప్పనిసరి. గోపీచంద్ సక్సెస్ అందుకొని చాలాకాలం అవుతోంది. గత చిత్రం సీటీమార్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే, ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. దర్శకుడు మారుతీకి కూడా తన గత చిత్రం హిట్ ఇవ్వలేకపోయింది. అదీకాక ప్రభాస్ హీరోగా నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు. ఏరకంగా చూసుకున్నా మారుతికి 'పక్కా కమర్షియల్' పక్కాగా హిట్ ఇవ్వాలి.
హీరోయిన్ రాశీ ఖన్నా కూడా తెలుగులో మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతిరోజూ పండగే' తర్వాత మళ్ళీ వెంటనే సినిమా అవకాశం దక్కలేదు. చెప్పాలంటే రాశీకి గత చిత్రం హిట్ ఇచ్చినా కూడా గ్యాప్ బాగానే వచ్చింది. ఇప్పుడు తెలుగులో 'పక్కా కమర్షియల్' సినిమాతో పాటుగా అక్కినేని నాగ చైతన్య సరసన 'థాంక్యూ' సినిమాలోనూ నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, త్వరలో ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. చూడాలి మరి మారుతి - గోపీచంద్ - రాశీ ఖన్నాలకు 'పక్కా కమర్షియల్' ఎలాంటి హిట్ ఇస్తుందో.