Ramajogaiah Sastry: ‘సరస్వతీపుత్ర’పై కామెంట్స్.. హర్టయిన రామ్జో
ABN , First Publish Date - 2022-11-25T21:21:33+05:30 IST
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని..
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘జై బాలయ్య’ (Jai Balayya)ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పాట ట్యూన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanthi) ‘ఒసేయ్ రాములమ్మా’ (Osey Ramulamma) పాట ట్యూన్ని పోలి ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్సే కాదు కొందరు ఆ పాటని, ఈ పాటని మిక్స్ చేసి వీడియోలు కూడా వదులుతున్నారు. పాటకు సంగీతం అందించిన థమన్ (S Thaman)ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు ట్రోలర్స్ రామజోగయ్య శాస్త్రిగారి పేరు ముందు ఉన్న సరస్వతీపుత్ర అనే బిరుదును కూడా అవహేళన చేస్తుండటంతో.. ఆయన హర్టయ్యారు. అలా ట్రోల్ చేస్తున్న వారందరికీ.. ట్విట్టర్ వేదికగా రామజోగయ్య శాస్త్రి ఓ స్ట్రాంగ్ మెసేజ్తో సమాధానమిచ్చారు.
‘‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను... దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..ఉంటే ఇటు రాకండి’’ అంటూ రామజోగయ్య శాస్త్రి.. ట్రోలర్స్పై ఫైర్ అయ్యారు. కాగా, ఈ పాటని బాలయ్య ఫ్యాన్స్ (Balayya Fans) మాత్రం యమా ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్యకు పర్ఫెక్ట్గా సరిపోయేలా సాహిత్యం ఇచ్చారని.. శాస్త్రిగారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలయ్య సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.