Rajamouli: నాలాంటి దర్శకులను ఇరుకులో పెట్టేసింది

ABN , First Publish Date - 2022-12-12T00:52:34+05:30 IST

‘కాంతార’ చిత్రం తనలాంటి దర్శకులను ఇరుకులో పెట్టేసిందని ఆసక్తికర కామెంట్లు చేశారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ చిత్రం కంటెంట్‌ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది.

Rajamouli:  నాలాంటి దర్శకులను ఇరుకులో పెట్టేసింది

‘కాంతార’ (Kantara)చిత్రం తనలాంటి దర్శకులను ఇరుకులో పెట్టేసిందని ఆసక్తికర కామెంట్లు చేశారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. (Rajamouli comments on Kantara)16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ చిత్రం కంటెంట్‌ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. తాజాగా కాంతార మూవీ బడ్జెట్‌ను ఉద్దేశించి దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబడతాయని ‘కాంతార’ (Rishab shetty)నిరూపించింది. బడ్జెట్‌ సినిమాలు ప్రత్యేకమే. కానీ చిన్న బడ్జెట్‌లో రూపొందిన ‘కాంతార’ కలెక్షన్లతో మ్యాజిక్‌ చేసింది. దీంతో సినిమా మేకింగ్‌ భారీగా ఉండాలనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది. నా లాంటి భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే దర్శకులను ఆలోచనలో పడేసింది. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి రివ్యూ చేసుకునేలా చేసింది. ఇక నుంచి మేం సినిమా మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని ‘కాంతార’ సినిమా చూశాక తెలిసింది’’ అని అన్నారు. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ చిత్రం మొదట కన్నడలో విడుదలై తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. 

Updated Date - 2022-12-12T00:52:34+05:30 IST