Rajamouli: క్రేజీ కాంబినేషన్ – క్రేజీ కథ!
ABN , First Publish Date - 2022-09-13T23:05:58+05:30 IST
మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలాకాలంగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పలు కారణాలు.. వల్ల డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది.
మహేశ్బాబు(Maheshbabu)–రాజమౌళి (Rajamouli)కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలాకాలంగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పలు కారణాలు.. వల్ల డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. కథకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళికి సరెండర్ అవుతారు మహేశ్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేసినట్లు, అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ, జేమ్స్బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ కథ అనుకున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రాజమౌళి ఈ సినిమా లైన్ గురించి చెప్పారు. ‘‘ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి కథ ఇది. పక్కా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉంటుంది. ఇందులో మహేశ్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. ’’ అని చెప్పారు.
రాజమౌళి సినిమా కోసం మహేశ్ కూడా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఆయనతో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లే అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ చెప్పిన సంగతి తెలిసిందే! ''ఆయనతో సినిమా చేయాలన్న కల నెరవేరుతోంది. జాతీయ స్థాయిలో సరిహద్దులు చెరిపే సినిమా అవుతుంది’’ అని మహేశ్ గతంలో చెప్పారు.