Allu Arjun: సైనికుల సాదర స్వాగతం..!
ABN , First Publish Date - 2022-09-30T02:09:04+05:30 IST
మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)
మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో వైవిధ్యాన్ని చూపించాడు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు. తన భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని అమృత్సర్కు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో కుటుంబంతో సమయాన్ని గడపుతున్నాడు. కొన్ని రోజుల పాటు కుటుంబ సమేతంగా విదేశాలను చుట్టి వచ్చాడు. ఈ లోగా తన భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టిన రోజు వచ్చింది. ఆమె పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడానికి అమృత్సర్కు వెళ్లాడు. స్వర్ణదేవాలయాన్ని సందర్శించాడు. అనంతరం వాఘా బోర్డర్కు వెళ్లాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సైనికులతో కొంత సమయాన్ని గడిపాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బన్నీ అభిమానులు విపరీతంగా వాటిని షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ లో సైనికుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను అనేక మిలిటరీ ప్రాంతాల్లో చేపట్టారు. అప్పటి నుంచి తనకు వీలు చిక్కినప్పుడల్లా బన్నీ మిలిటరీ ప్రాంతాలను సందర్శిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను సందర్శించారని పిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ‘పుష్ప 2’ (Pushpa 2) షూటింగ్ను అక్టోబర్ 1నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. టాలీవుడ్లోని ఇద్దరు అగ్ర దర్శకులతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.