‘పుష్ప’ ప్రభంజనం.. అస్సలు తగ్గట్లేదుగా..

ABN , First Publish Date - 2022-01-03T03:57:07+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప- ది రైజ్’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన..

‘పుష్ప’ ప్రభంజనం.. అస్సలు తగ్గట్లేదుగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప- ది రైజ్’. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాదిలో కూడా అదే జోరు చూపిస్తుంది వసూళ్లు రాబడుతోంది. విడుదలైన 16వ రోజు హిందీలో ఏకంగా రూ. కోట్లకు పైగా వసూలు చేసి.. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా రికార్డులతో దూసుకుపోతోంది. హిందీలో పుష్ప సినిమాకు హైయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాబడుతోన్న ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ. 56 కోట్లు కలెక్ట్ చేసి, రూ. 75 కోట్ల దిశగా దూసుకుపోతున్నట్లుగా బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండటం విశేషం. 


కాగా, మొత్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.



Updated Date - 2022-01-03T03:57:07+05:30 IST