Puri Jagannadh: ‘జెజీఎమ్’ మొదలైంది!
ABN , First Publish Date - 2022-06-04T22:42:21+05:30 IST
పూరి జగన్నాథ్ (puri jagannadh)డ్రీమ్ ప్రాజెక్ట్కు ‘జెజీఎమ్’(JGM)కు సంబంధించి ఇటీవల ప్రకటన వచ్చింది. ముంబైలో ఓ ఈవెంట్ చేసి ఈ చిత్రాన్ని ప్రకటించారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి (Vamsi paidipalli)నిర్మిస్తున్నారు.
పూరి జగన్నాథ్ (puri jagannadh)డ్రీమ్ ప్రాజెక్ట్కు ‘జెజీఎమ్’(JGM)కు సంబంధించి ఇటీవల ప్రకటన వచ్చింది. ముంబైలో ఓ ఈవెంట్ చేసి ఈ చిత్రాన్ని ప్రకటించారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి (Vamsi paidipalli)నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన పూజ హెగ్డేను కథానాయిక ఎంపిక చేసారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ఛార్మి (Charmee) ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసి తెలిపారు.