Priyaka jawalker: కరోనా పాజిటివ్..!
ABN , First Publish Date - 2022-01-20T14:43:05+05:30 IST
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. థర్డ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటికే మహేశ్ బాబు, మీనా, లక్ష్మీ మంచు,
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. థర్డ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటికే మహేశ్ బాబు, మీనా, లక్ష్మీ మంచు, కీర్తి సురేశ్, త్రిష సహా పలువురు సినీ తారలు కరోనా బారిన పడ్డారు. వీరిలో కీర్తి సురేశ్, లక్ష్మీ మంచు లాంటి వారు పూర్తిగా కోలున్నామని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. అయితే, ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించి ‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న ఆమె, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని, ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అలాగే, దయచేసి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇన్స్టాగ్రాం పోస్ట్లో పేర్కొన్నారు. ఇక ప్రియాంక జవాల్కర్ ఇటీవల వచ్చిన ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లాంటి చిత్రాలతో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలలో హీరోయిన్గా చేస్తున్నారు.