Bade Miyan Chote Miyan: విలన్గా పృథ్వీరాజ్
ABN , First Publish Date - 2022-12-07T21:10:34+05:30 IST
మలయాళంలోని స్టార్ హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ (Prithviraj Sukumaran) ఒకరు. కొత్త రకం కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కథ నచ్చితే ఏ రోల్ అయినా చేస్తుంటాడు.
మలయాళంలోని స్టార్ హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఒకరు. కొత్త రకం కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కథ నచ్చితే ఏ రోల్ అయినా చేస్తుంటాడు. తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రను పోషించనున్నాడు. మెగా ప్రాజెక్టులో అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లతో కలసి నటించబోతున్నాడు.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘బడే మియా, చోటే మియా’ (Bade Miyan Chote Miyan). పూజా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నాడు. కబీర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘పృథ్వీరాజ్ సుకుమారన్ రావడంతో ‘బడే మియా, చోటే మియా’ కుటుంబం పెద్దదైంది. క్రేజీ యాక్షన్ రోలర్ కోస్టర్ రైడ్కు స్వాగతం’’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్కు పృథ్వీరాజ్ స్పందించాడు. ‘థాంక్ యూ సార్’ అని రిప్లై ఇచ్చాడు. ఈ చిత్రంలో భాగమైనందుకు పృథ్వీరాజ్ కూడా సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘అద్భుతమైన చిత్ర బృందంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు. ‘టైగర్ జిందా హై’ ను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ‘బడే మియా, చోటే మియా’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కనుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ లోను పృథ్వీరాజ్ విలన్గా కనిపించనున్నాడు. వరదరాజ మన్నార్ అనే విలన్ పాత్రను పోషించనున్నాడు.