అయోధ్య వెళుతున్న ప్రభాస్
ABN , First Publish Date - 2022-09-27T06:13:28+05:30 IST
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ప్రమోషన్ వర్క్ ప్రారంభిస్తున్నారు...
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ప్రమోషన్ వర్క్ ప్రారంభిస్తున్నారు. రామాయణ నేపథ్యంలో జరిగే కథ కావడంతో రామజన్మ భూమి అయిన అయోధ్యలో టీజర్ను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 2న ప్రభాస్ సహా యూనిట్ లోని ముఖ్య సభ్యులు అయోధ్య వెళుతున్నారు. అలాగే ఈ ఫంక్షన్ను కవర్ చేయడం కోసం ముంబై నుంచి మీడియాను అయోధ్య తీసుకెళుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్యలో టీజర్ ఫంక్షన్ను నిర్వహించాలనీ, అందరికీ ఓ తీపి గుర్తులా ఈ వేడుక నిలిచిపోవాలనీ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు. కృతి సనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, వస్తల్ సేఠ్ ముఖ్య పాత్రలు పోషించారు. విజువల్ వండర్గా రూపుదిద్దుకొన్న ‘ఆదిపురుష్’ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ‘ఆదిపురుష్’ విడుదల కానుంది. అలాగే దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఢిల్లీలోని రామ్లీలా గ్రౌండ్స్లో జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్లు లవకుశ రావణలీల కమిటీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ వెల్లడించారు.