కాన్స్ గడపలో తారల తళుకులు!
ABN, First Publish Date - 2022-05-19T05:30:00+05:30
ప్రపంచ చిత్రపరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ చలన చిత్రోత్సవం మంగళవారం ప్రారంభమైంది.
ప్రపంచ చిత్రపరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ చలన చిత్రోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఫ్రాన్స్లో జరుగుతున్న ఈ 75వ చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన తారలు రెడ్ కార్పెట్పై తళుక్కున మెరిశారు. ఈసారి ఉత్సవాలకు భారత్కు ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పలువురుసెలబ్రిటీలు ఈ వేడుకలు హాజరయ్యారు. అలాగే విజేతలను ఎన్నిక చేసే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో ఈ ఏడాది దీపిక కూడా ఒకరు కావడంతో సభ్యసాచి డిజైన్ చేసిన చీరతో ఆమె రెడ్ కార్పెట్ పై మెరిశారు. తొలిసారిగా కాన్స్ వేడుకల్లో పాల్గొంటున్న తమన్నా కూడా ఫెస్టివల్కు వెళుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే పూజా హెగ్డే కూడా కొన్ని ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ కూడా ఈసారి ఈ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చివరి నిమిషంలో ప్రయాణం రద్దయింది. ‘విక్రమ్’ సినిమా ట్రైలర్ విడుదల కోసం కమల్హాసన్, ఏఆర్ రెహమాన్ టీమ్ ఫ్రాన్స్ చేరుకుంది.