‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆ జీవో వర్తించదు!

ABN , First Publish Date - 2022-03-17T21:23:14+05:30 IST

సినిమా ఇండస్ట్రీ పెద్దలు, వివిధ సంఘాలతో చర్చలు, వివాదాలు, విమర్శల తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో నం:13ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన సినిమాలకు మొదటి పదిరోజులపాటు ప్రత్యేక టికెట్‌ ధరలు పెట్టేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆ జీవో వర్తించదు!

సినిమా ఇండస్ట్రీ పెద్దలు, వివిధ సంఘాలతో చర్చలు, వివాదాలు, విమర్శల తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో నం:13ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన సినిమాలకు మొదటి పదిరోజులపాటు ప్రత్యేక టికెట్‌ ధరలు పెట్టేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వమని కోరుతూ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. దీనిపై తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘‘దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100 కోట్లు వ్యయం దాటితే.. సినిమా విడుదలైన పదిరోజులు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఉందని జీవో నం: 13లో తెలిపాం. అందులో భాగంగానే రాజమౌళి దర్శకత్వవ వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి టికెట్‌ ధరల పెం,మని కోరుతూ వినతి పత్రం అందింది. జీఎస్టీ, పారితోషికాలు కాకుండా చిత్రానికి రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు చిత్ర బృందం ఇచ్చిన వివరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపిస్తాం. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ప్రత్యేక టికెట్‌ ధరలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జీవో రావడానికి ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చితాన్ని నిర్మించారు కాబట్టి రాష్ట్రంలో 20 శాతం షూటింగ్‌ నిబంధన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వర్తించదు. కొత్తగా నిర్మించే చిత్రాలకు కొత్త జీవో నిబంధనలు వర్తిస్తాయి’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-17T21:23:14+05:30 IST