యువ క్రికెటర్కు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం
ABN, First Publish Date - 2022-03-10T01:41:34+05:30
ఇటీవల జరిగిన భారత అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా మరియు బ్యాట్స్మెన్గా సత్తా చాటిన తెలుగు యువకుడు షేక్ రషీద్కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఎటువంటి విపత్తులు సంభవించినా..
ఇటీవల జరిగిన భారత అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా మరియు బ్యాట్స్మెన్గా సత్తా చాటిన తెలుగు యువకుడు షేక్ రషీద్కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఎటువంటి విపత్తులు సంభవించినా, ఎవరికైనా చేయూతనివ్వాలన్నా.. పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారనేది ఇప్పటికే అనేక మార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
గుంటూరుకి చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్, అతనికి తన ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. జనసేన పార్టీ నేతలు రషీద్ నివాసానికి వెళ్లి ఈ సాయాన్ని అందించినట్టుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో రషీద్ని కలుస్తానని పవన్ కల్యాణ్ మాట కూడా ఇచ్చారని జనసేన నేతలు తెలుపుతున్నారు. గతంలో కూడా ప్రతిభ ఉన్న యువతకి పవన్ కల్యాణ్ ఇలా అనేకమార్లు ఆర్థిక సహాయం అందించారు.