తేరి మేరి బీచ్ మే...!
ABN, First Publish Date - 2022-12-10T06:29:19+05:30
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తరవాత హరీశ్తో ‘భవదీయుడు భగత్సింగ్’ అనే సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కించాలని అనుకొన్నారు. ఇటీవలే ఆ సినిమాని పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ఈ కాంబో ఆగిపోలేదని, వీరిద్దరితో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందించడానికి కసరత్తులు ముమ్మరం చేసిందని వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తెరి’ రీమేక్ ఈ కాంబోలో తీసుకొస్తారని టాక్. పవన్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్తో పాటు హరీశ్ శంకర్.. పవన్ని కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.