Keeravani చేతులమీదుగా ‘పంచతంత్ర కథలు’ ట్రైలర్!
ABN , First Publish Date - 2022-07-10T00:13:28+05:30 IST
ఐదు వేరువేరు కథలతో ఆంథాలజీగా తెరకెక్కిన చిత్రం ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీతా భాస్కర్; ప్రణీత పట్నాయక్ కీలక పాత్రధారులు. శనివారం ఈ చిత్రం ట్రైలర్ను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు.
ఐదు వేరువేరు కథలతో ఆంథాలజీగా తెరకెక్కిన చిత్రం ‘పంచతంత్ర కథలు’(Panchatantra kathalu). మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీతా భాస్కర్; ప్రణీత పట్నాయక్ కీలక పాత్రధారులు. శనివారం ఈ చిత్రం ట్రైలర్ను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఆసక్తికర ఐదు కథాంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. పాత్రలన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. నోయల్ నటిస్తున్న ఈ చిత్రం గురించి ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Panchatantra kathalu trailer)