NTR: అప్పూ సేవలు మరచిపోలేం!

ABN , First Publish Date - 2022-11-02T01:45:12+05:30 IST

కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr) అద్భుతంగా ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆహ్వానం మేరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

NTR: అప్పూ సేవలు మరచిపోలేం!

కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr) అద్భుతంగా ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆహ్వానం మేరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఎన్టీఆర్‌ కన్నడలో (Ntr emotional speech)మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహితుడు పునీత్‌ రాజ్‌కుమార్‌పై (Puneeth rajkumar)ప్రశంసలు వర్షం కురిపించారు తారక్‌. ఆయన మాట్లాడుతూ ‘‘అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలను మాటల్లో చెప్పలేం. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేను. అప్పూ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. గొప్ప కార్యక్రమంలో నన్ను భాగం చేసిన కర్ణాటక ప్రభుత్వానికీ ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత కన్నడ మెగాస్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డును కుటుంబ సభ్యులకు అందజేశారు. 

Updated Date - 2022-11-02T01:45:12+05:30 IST