Nataratnalu: యమా ఫాస్ట్గా ఉన్నారు
ABN , First Publish Date - 2022-07-20T00:45:58+05:30 IST
ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నర్రా శివనాగు (Narra Shivanagu) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నటరత్నాలు’ (Nataratnalu). సుదర్శన్ (Sudarshan), రంగస్థలం మహేష్ (Rangasthalam Mahesh), అర్జున్ తేజ్..
ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నర్రా శివనాగు (Narra Shivanagu) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నటరత్నాలు’ (Nataratnalu). సుదర్శన్ (Sudarshan), రంగస్థలం మహేష్ (Rangasthalam Mahesh), అర్జున్ తేజ్ (Arjun Tej) నటరత్నాలుగా నటిస్తుండగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వెండితెరకు పరిచయం చేసిన ఇనయా సుల్తాన (Inaya Sultana) హీరోయిన్గా నటిస్తోంది. మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కథాకథనం.. యూత్నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ని కూడా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని దర్శకుడు నర్రా శివనాగు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ పూర్తయిందని, ఇక పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని తాజాగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి డా. దివ్య (Dr. Divya), ఆనందాసు శ్రీ మణికంఠ (Anandasu Sri Manikantha) నిర్మాతలు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా సినిమా ‘నటరత్నాలు’ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. దర్శకుడు శివనాగుగారు సినిమాని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. చెప్పిన టైమ్ కంటే కూడా ముందుగానే ఈ చిత్ర టాకీ పార్ట్ను ఆయన కంప్లీట్ చేశారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేయనున్నాం. అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు. అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, సీనియర్ దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్ నాగమధు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండగా.. గిరి కుమార్ సినిమాటోగ్రఫీ, ఆవుల వెంకటేష్ ఎడిటర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.