సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Ghost: ఘోస్ట్‌కి గెస్ట్‌లుగా ఆ ఇద్దరు!

ABN, First Publish Date - 2022-09-23T22:18:30+05:30

కింగ్ నాగార్జున (King Nagarjuna), ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). దసరా స్పెషల్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కింగ్ నాగార్జున (King Nagarjuna), ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). దసరా స్పెషల్‌గా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌‌ను యమా జోరుగా నిర్వహించే పనిలో చిత్రబృందం ఉంది. అందులో భాగంగా రోజుకో స్పెషల్ అన్నట్లుగా అప్‌డేట్స్‌ని వదులుతున్నారు. గురువారం నాగార్జున, సోనాల్ చౌహాన్ (Sonal Chauhan)  ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసిన మేకర్స్.. శుక్రవారం మరో అప్‌డేట్‌ వదిలి.. అక్కినేని అభిమానులను (Akkineni Fans) ఖుషి చేశారు. అక్కినేని అభిమానుల ఆనందానికి కారణమైన ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారా?


ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సెప్టెంబర్ 25న కర్నూలులో గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ‘ది ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌‌లుగా నాగార్జున కుమారులైన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హాజరు కాబోతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ (Soggade Chinni Nayana) టైమ్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ పంచెకట్టులో కనిపించి అక్కినేని అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత.. మరోసారి ‘ది ఘోస్ట్’ కోసం వారు ఒకే స్టేజ్‌పై దర్శనమివ్వబోతుండటంతో.. అక్కినేని అభిమానులకు ఆ వేడుక కన్నుల పండుగే అని చెప్పుకోవచ్చు. ఘోస్ట్ కోసం గెస్ట్‌లుగా చైతూ (Chaitu), అఖిల్‌ (Akhil)లు వస్తున్నారని తెలిసిన మరుక్షణం నుండే అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ.. పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక సెప్టెంబర్ 25న వారి హంగామా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.


కాగా, నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో గుల్ పనాగ్ (Gul Panag), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కీలక పాత్రలలో కనిపించనున్నారు. మార్క్ కె రాబిన్ (Mark K Robin) ఈ సినిమాకు సంగీతం అందించారు.





Updated Date - 2022-09-23T22:18:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!